నయా తెలంగాణ న్యూస్/ యాదాద్రి భువనగిరి/ ఫిబ్రవరి 13:
సంస్థన్ నారాయణపురం గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయం నందు మహాశివరాత్రి 23వ వార్షిక మహోత్సవంలో మొదటి రోజు పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ అధ్యక్షులు పాలకూర సతీష్ గౌడ్ శ్యామల, గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పాలకూర గిరి, గౌరవ అధ్యక్షులు పాలకొల్లు యాదయ్య గౌడ్ (సూర్య) ప్రధాన కార్యదర్శి సురపల్లి జవహర్, ఉపాధ్యక్షులు పట్నం రాములు గౌడ్, సురకంటి జనార్దన్ రెడ్డి, ప్రచార కార్యదర్శి గొల్లూరి శ్రీశైలం సాగర్, పాలకూర వెంకటేష్ గౌడ్, బద్దం లింగస్వామి గౌడ్, అచ్చిని రవి, పాలకూర్ల జయసూర్య, ఆలయ పూజారి రాజమౌళి, గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం అఖండ దీపారాధన, గణపతి పూజ, పుణ్యవచనం, ధ్వజరోహణం, జండా పూజ, రుద్రాభిషేకం, తీర్థప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు.
