నయా తెలంగాణ న్యూస్/ యాదాద్రి భువనగిరి/ ఆగస్టు 1:

మండలంలోని సర్వేల గ్రామపంచాయతీ చెందిన చిలివేరు లింగస్వామి గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల మరణించడం జరిగింది . అతని కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి నేనున్నాను అంటూ ముందుకు వచ్చిన వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్న
శ్రీవోజు హనుమంతచారి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి నారు. ధైర్యం కోల్పోకుండా ఉండాలని ధైర్యం చెప్పారు. వారి యొక్క కుమారుడు చదువుకు తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. గ్రామంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి అండగా ఉంటూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించిన కోసం ప్రయత్నం చేసి అండగా ఉంటానన్నారు. గ్రామంలో జరిగేటువంటి దేవాలయ నిర్మాణానికి గాని పండగలకు గాని పాఠశాలల అభివృద్ధి గాని విద్యార్థులు పాఠశాలలకు మొదటి ర్యాంకుతో మార్కులు తెచ్చుకున్న వారికి ప్రోత్సాహక బహుమతి ఇస్తూ .అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేసి గ్రామానికి అండగా ఉంటానని తెలిపారు. సర్వేలు గ్రామంలో పుట్టినందుకు పేద ప్రజలకు ఆదుకుని అవకాశం కల్పించిన ఆ దేవునికి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వకంగా వారికి అండదండలతో అభివృద్ధి పరిచేందుకు శక్తివంతం లేకుండా కృషి చేశాను తెలిపారు
ప్రతి మనిషికి దేవుడు ఏదో కల రూపకంగా ఇస్తాడు కానీ అమలు పరచడంలో కొంతమంది చేయలేక పోతారు దేవుడిచ్చిన వరం నాకు పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా తనకు వచ్చిన ఆదాయంలో పేద ప్రజలకు పంచడం ద్వారా ఆనందంగా ఉందన్నారు. గ్రామ ప్రజలు స్థానిక సంస్థ ఎలక్షన్లలో కోరుకుంటే సర్పంచ్ గా పోటీ చేసి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ జిల్లాలోని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్ది నిరుపేద సమస్యలా అంటూ ఉండకుండా పనిచేస్తానని తెలిపారు కేవలం గ్రామ అభివృద్ధి కోసమే పాటు పడతానని ఎటువంటి రాజకీయాలకు తలగకుండా పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రయత్నిస్తూ గ్రామాన్ని గ్రామ సపరిపాలనాన్ని అందించడానికి ముందుకొస్తున్నాను ఈ కార్యక్రమంలో. బి.యస్.పి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కత్తుల పరమేష్ మాట్లాడుతూ మన ఊరి బిడ్డ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అత్యున్నత స్థానంలో నిలిచి మన గ్రామానికి అభివృద్ధి కోసం ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనునిత్యం అండగా ఉంటూ వారి యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం రావడం అదృష్టంగా భావిస్తున్నాం గ్రామానికి మంచి చేసేటువంటి మనసున్న వ్యక్తులు ఏది ఆశించకుండా ముందుకొచ్చిన వారే గొప్ప మనసున్న వారని అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణ బిక్షం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *