నయా తెలంగాణ న్యూస్ /మెదక్ :
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కాళేశ్వరం జలాలతో జలా అభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. అనంతరం మెదక్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

