మాజీ ఎమ్మెల్యే శశిథర్ రెడ్డి
నయా తెలంగాణ న్యూస్ / మెదక్, సెప్టెంబర్ 02:
మెదక్ పట్టణం లో గత నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించిన జర్నలిస్టు కాలనీలో రోడ్లు, మౌలిక వసతులు అధ్వాన్నంగా ఉన్నాయన్న విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు శశిథర్ రెడ్డి జర్నలిస్టు కాలనీలో రోడ్లను పరీశీలించారు. రహదారి సరిగా లేకపోవడం జర్నలిస్టు జీవితం పరుగు పరుగున బయలుదేరాలి కానీ రోడ్లు గుంతల మయంగా ఉండడం తో పరిస్థితి ని చూసి జర్నలిస్టు ల సాదక భాధలు అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుందో అని అన్నారు. త్వరిత గతిన కాలనీ కి రోడ్డు వేయడం వల్ల విషపు పురుగులు భయం ఉండదని త్వరలోనే ముఖ్యమంత్రి ద్రృష్టి కి తీసుకువెళాతనని అన్నారు.
