నయా తెలంగాణ న్యూస్ / నారాయణపురం, సెప్టెంబర్ 07: వైద్య శిబిరాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులకు అవసరమైన మందులు ఇవ్వడం జరిగిందని,, శస్త్ర చికిత్స అవసరమైన వారిని ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని తెలిపారు.

