నయా తెలంగాణ న్యూస్ :న్యాయవ్యవస్థలో ఎంట్రీ-లెవల్ పోస్టులకు సంబంధించి సుప్రీం కోర్ట్ మంగళవారం కీలకమైన తీర్పును వెల్లువరించింది. న్యాయవ్యవస్థలో ఎంట్రీ-లెవల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థికి న్యాయవాదిగా కనీసం మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ తప్పనిసరి అనే షరతును పునరుద్ధరించింది. చీఫ్ జస్టిస్ BR గవై, జస్టిస్ AG మసీహ్, జస్టిస్ K వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మాసనం ఈ విధంగా పేర్కొంది. ఈ షరతు ఇప్పటికే ఉన్న వారికి వర్తించదని, భవిష్యత్ నియామకాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. జ్యుడీషియల్ ఆఫీసర్ ఆమోదించిన కనీసం పది సంవత్సరాల హోదా కలిగిన న్యాయవాది యొక్క సర్టిఫికేట్, షరతు నెరవేర్పును చూపించడానికి సరిపోతుంది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి విషయంలో, కోర్టు నియమించిన అధికారి ఆమోదించిన కనీసం పది సంవత్సరాల హోదా కలిగిన న్యాయవాది యొక్క సర్టిఫికేట్ రుజువుగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
